News April 5, 2025
సోలార్ రూప్ టాప్పై అవగాహన కల్పించండి: కలెక్టర్ చేతన్

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10వేల రూప్ టాప్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
Similar News
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
News December 1, 2025
HYDలో NEW YEAR సెలబ్రేషన్స్.. పర్మిషన్ తప్పనిసరి!

న్యూ ఇయర్-2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. 21-12-2025లోపు దరఖాస్తులను https://cybpms.telangana.gov.in/ వెబ్సైట్లో సమర్పించాలని సూచించారు. కమర్షియల్/టికెటెడ్ ఈవెంట్లకు ఒక ఫారం, టికెట్ లేకుండా జరిగే ఈవెంట్లు నాన్ కమర్షియల్ ఫారంలో వివరాలు ఫిల్ చేయాలన్నారు. ఫిజికల్ అప్లికేషన్లకు అంగీకారం లేదని, DEC 21 తర్వాత దరఖాస్తులు తీసుకోమని పోలీసులు వెల్లడించారు.
News December 1, 2025
WNP: పోలీసుల కర్తవ్యం నిబద్ధత ప్రశంసనీయమైనది: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి కర్తవ్య నిబద్ధత ప్రశంసనీయమైనదని వనపర్తి ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరులో సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేసిన అధికారులకు సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, పూర్తి శాంతియుత వాతావరణంలో సీఎం పర్యటన జరిగిందని సహకరించిన పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.


