News February 12, 2025
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు: SP

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాను ఐటి పోలీసులు పరిశీలిస్తూ ఉంటారని చెప్పారు.
Similar News
News November 7, 2025
HYD సైబర్ క్రైమ్ దుమ్మురేపే ఆపరేషన్

HYD సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ ఆపరేషన్లో భారీ దందాలు ఛేదించారు. మొత్తం 196 కేసులు, 55 అరెస్టులు, ₹62 లక్షల రిఫండ్ చేశారు. డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ & ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాల్లో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి నిందితులు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మరిన్ని కేసుల్లో రూ.లక్షల్లో రిఫండ్ చేశారు.
News November 7, 2025
రామగుండంలో PM అప్రెంటిషిప్ మేళా

RGM ప్రభుత్వ ఐటీఐలో NOV 10న ఉదయం 10 గంటలకు “ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా” నిర్వహించబడుతుంది. ఈ మేళాలో ఎల్&టి, వరుణ్ మోటార్స్, స్నైడర్ ఎలక్ట్రికల్స్, తోషిబా, ఉషా ఇంటర్నేషనల్, కేశోరాం సిమెంటు వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటీఐ ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. అప్రెంటిషిప్ చేయదలచిన అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
News November 7, 2025
‘విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి’

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మీనారాయణ అన్నారు. వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక తరపున ఏర్పాటు చేసిన చెకుముకి టాలెంట్ టెస్ట్ ను అర్బన్ మండల విద్యాధికారి బానాల సదానందంతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు 37 సంవత్సరాలుగా సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు.


