News March 28, 2024

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు:SP

image

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

Similar News

News January 22, 2025

మానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే ‘వేముల’

image

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల మరోసారి మానవత్వం చాటుకున్నారు. నకిరేకల్ మండలం కడపర్తిలో బుధవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభకు హజరైన ఆయనకు ఓ మహిళ పెన్షన్ రావడంలేదని తెలిపింది. ఏడేళ్ల నుంచి నరాల వ్యాధితో బాధపడుతున్న తన భర్త సత్తయ్యకు పెన్షన్ రావడం లేదని గంగమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లింది. పెన్షన్ మంజూరు అయ్యేంతవరకు తానే సొంత డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు అందించారు.

News January 22, 2025

ఎంజీయూ డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్‌ల ఫలితాలను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 6300 మంది విద్యార్థులకు గాను 1338 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 3వ సెమిస్టర్‌లో 4509 మందికి గాను 1569 మంది, 5వ సెమిస్టర్‌లో 5378 మందికి గాను 2380 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీఓజీ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.

News January 22, 2025

నల్గొండలో ఈనెల 28న రైతు మహాధర్నా

image

నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 28న బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించనున్నారు. క్లాక్ టవర్ సెంటర్‌లో జరిగే రైతు మహా ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గం.నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు కార్యక్రమానికి హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రైతు ధర్నాను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.