News February 5, 2025
సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

జిల్లా ప్రజలందరూ సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. తన కార్యాలయం నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను వాట్సప్ ఛానల్ ద్వారా అప్రమత్తం చేస్తూనే ఉంటుందని తెలిపారు. మా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమాలను వీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News November 2, 2025
రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు జిల్లా జట్టు పయనం

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు శ్రీ సత్యసాయి జిల్లా తరఫున పాల్గొనే జట్టు నేడు నరసరావుపేటకు బయలుదేరినట్లు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ పూల ప్రసాద్ తెలిపారు. 19వ రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు నేడు నరసరావుపేటలో ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి ప్రాతినిద్యం వహించే ధర్మవరం బీఎస్సార్ మున్సిపల్ పాఠశాల క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని అనంతపురం జిల్లా సెక్రటరీ లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.
News November 2, 2025
రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి: కలెక్టర్

జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్లోని మినీ కాన్ఫరెన్స్ లో భారతీయ రెడ్ క్రాస్ సమైక్య అనంతపురం శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రక్త కేంద్రాలలో సరిపడా రక్త నిల్వ ఉండేలా చూసుకోవడం ముఖ్యమైందని తెలిపారు.
News November 2, 2025
సీటు కేటాయిస్తే చదువుకుంటా సారు..!

ఆదోని KGBV పాఠశాలలో చదువుతూ చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సోగునూరుకు చెందిన నివేదితను ఎమ్మిగనూరు KGBVకు తల్లితండ్రులు DEO రెఫర్ ద్వారా మార్చుకున్నారు. అయితే DEO ఆదేశాలను లెక్కచేయని GCDO నివేదిత చదువుకు ఆటంకం కలిగిస్తోంది. YGRలో సీటు ఇవ్వాలని ప్రాధేయపడినా ఆమె చలించలేదు. ప్రస్తుతం బాలికను తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలకు తీసుకెళుతున్నారు. సీటు కేటాయిస్తే చదువుకుంటానని బాలిక తెలిపింది.


