News November 9, 2024

సోషల్ మీడియా పట్ల జాగ్రత్తలు వహించాలి: ప్రకాశం ఎస్పీ

image

ప్రకాశం జిల్లాలో సోషల్ మీడియా ఉపయోగించే వారు జాగ్రత్తలు వహించాలని ఎస్పీ దామోదర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతాల, కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, అశ్లీల చిత్రాలు, ఇతరులను ఇబ్బంది పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు.

Similar News

News October 25, 2025

కర్నూలు బస్సు ప్రమాద మృతుల్లో ఒంగోలు వాసి.!

image

కర్నూలు వద్ద శుక్రవారం <<18088805>>ఘోర బస్సు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఒంగోలుకు చెందిన బొంత ఆదిశేషగిరిరావు ఉన్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ఒంగోలులోని కమ్మపాలెం సమీపంలో ఆదిశేషగిరిరావు కుటుంబీకులు నివసిస్తున్నారు. అయితే శేషగిరిరావు బెంగళూరులోని IOC కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా HYD-BLR వెళ్లే క్రమంలో మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు.

News October 25, 2025

కొండపి: స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

image

కొండపిలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండపి నుంచి అనకర్లపూడి వెళ్లే బస్సు పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.

News October 25, 2025

కర్నూలు ఎఫెక్ట్.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులకు హడల్..!

image

కర్నూల్‌లో ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని నేషనల్ హైవేలలో రాకపోకలు సాగిస్తున్న ట్రావెల్స్ బస్సుల రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా సాగాయి.