News January 29, 2025
సౌదీలో రోడ్డు ప్రమాదం.. మెట్పల్లి వాసీ మృతి

సౌదీలో రోడ్డు ప్రమాదంలో మెట్పల్లిలోని రేగుంటకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. కాపెల్లి రమేశ్ (30) మూడు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులకోసం మినీ బస్సులో ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు ఢీకొన్నాయి. ఇందులో 15 మంది చనిపోయారు. ఇందులో కాపెల్లి రమేశ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన మరోముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News November 18, 2025
రోడ్డుపై అడ్డంగా క్యూలైన్.. రాజన్న భక్తుల పాట్లు

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.
News November 18, 2025
రోడ్డుపై అడ్డంగా క్యూలైన్.. రాజన్న భక్తుల పాట్లు

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.
News November 18, 2025
టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు.. జర్మనీ సదస్సులో జిల్లా రైతులు

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయంలో ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు అని మామిడిపెల్లికి చెందిన రైతులు నోముల వేణుగోపాల్ రెడ్డి, మోకిడె శ్రీనివాస్, నాగారానికి చెందిన దుంపేట నాగరాజు తమ అనుభవాలను వివరించారు. ACRAT ప్రాజెక్టులో భాగంగా జర్మనీలో ఐదు రోజుల వ్యవసాయ సదస్సులో రాష్ట్రానికి చెందిన 12 మంది సభ్యుల బృందంతో కలిసి పాల్గొన్న వీరు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.


