News January 29, 2025
సౌదీలో రోడ్డు ప్రమాదం.. మెట్పల్లి వాసీ మృతి

సౌదీలో రోడ్డు ప్రమాదంలో మెట్పల్లిలోని రేగుంటకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. కాపెల్లి రమేశ్ (30) మూడు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులకోసం మినీ బస్సులో ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు ఢీకొన్నాయి. ఇందులో 15 మంది చనిపోయారు. ఇందులో కాపెల్లి రమేశ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన మరోముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News December 16, 2025
నెల్లూరు: రైలు కిందపడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నెల్లూరు విజయమహల్ వద్ద జరిగింది. విజయవాడ వైపు వెళ్లే గుర్తు తెలియని రైలులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందినట్లు నెల్లూరు రైల్వే SI హరిచందన తెలిపారు. అతడు ఎరుపు రంగు ఆఫ్ హాండ్స్ టీ షర్టు, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందన్నారు.
News December 16, 2025
అనకాపల్లి: పీఆర్ ఉద్యోగుల జడ్పీ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం

ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జడ్పీ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, నక్కపల్లి మండల పరిషత్ ఏఓ సీతారామరాజు తెలిపారు. సోమవారం జెడ్పీ ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో యూనిట్ ప్రెసిడెంట్గా పీవీవీఎన్ మూర్తి, అసోసియేట్ అధ్యక్షురాలుగా ఎన్.రాజేశ్వరి ఎన్నికైనట్లు తెలిపారు. కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా లోవతల్లిని ఎన్నుకున్నారన్నారు.
News December 16, 2025
మునగపాక: ‘మా ఊరి వెంకన్న’ చిత్రానికి అవార్డు

ఇటీవల విడుదలైన ‘మా ఊరి వెంకన్న’ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును అందుకుంది. చిత్ర దర్శకుడు కోరుకొండ గోపి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత కోటేశ్వరశర్మకు ఉత్సవం డైరెక్టర్ దిలీప్ కుమార్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు.


