News January 29, 2025

సౌదీలో రోడ్డు ప్రమాదం.. మెట్‌పల్లి వాసీ మృతి

image

సౌదీలో రోడ్డు ప్రమాదంలో మెట్‌పల్లిలోని రేగుంటకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. కాపెల్లి రమేశ్ (30) మూడు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులకోసం మినీ బస్సులో ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు ఢీకొన్నాయి. ఇందులో 15 మంది చనిపోయారు. ఇందులో కాపెల్లి రమేశ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన మరోముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News November 16, 2025

సరికొత్త రీతిలో మోసాలు.. జాగ్రత్త: ADB SP

image

సైబర్ నేరగాళ్లు సరికొత్త రీతీలో మోసం చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. గతవారం జిల్లాలో 11 కేసులో నమోదైనట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ జాబ్స్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్, లోన్ ఇస్తామంటూ వచ్చే యాడ్స్ నమ్మవద్దని వివరించారు. రూ.2 నోటుకు రూ.32 లక్షలు ఇస్తామంటూ వచ్చే ప్రచారాలు అవాస్తవమని వాటిని నమ్మకూడదన్నారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News November 16, 2025

ఫేస్ క్రీమ్ వాడుతున్నారా?

image

కొన్ని క్రీములను కలిపి రాయడం వల్ల అదనపు ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..ముడతలు ఎక్కువగా ఉన్నవారు విటమిన్-సి ఉన్న క్రీములతో పాటు సన్‌స్క్రీన్ లోషన్ కలిపి రాయాలి. చర్మం మృదువుగా ఉండాలంటే రెటినాల్, పెప్టైడ్ క్రీములు ఎంచుకోండి. అయితే రెటినాల్‌ను రాత్రే రాయాలి. హైలురోనిక్ యాసిడ్‌తోపాటు ఏహెచ్ఎ, బీహెచ్ఎ ఉన్నవి ఎంచుకోండి. ఈ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.

News November 16, 2025

మిర్యాలగూడకు మంత్రులు..ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా

image

మిర్యాలగూడలో సోమవారం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు.