News April 7, 2024

సౌదీ అరేబియాలో నెల్లూరు వాసుల మృతి

image

సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుత్తలూరు, గుంటూరుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయ. నర్రవాడకు చెందిన సత్యబాబు సౌదీలోని ఓ పారిశ్రామిక సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అతని మామ గుంటూరుకు చెందిన రామారావు దంపతులు వారి వద్దకు విజిటింగ్ వీసాపై వెళ్లారు. విమానాశ్రయం నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

Similar News

News October 31, 2025

నెల్లూరు: ఇండోసోల్ అంశంపై హైకోర్ట్ మొట్టికాయలు

image

ఇండోసోల్ పరిశ్రమకు చెరువుల్లోని మంచినీటిని ఎలా ఇస్తారంటూ హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చెరువుల్లోని తాగునీటిని ఇండోసోల్ పరిశ్రమకు తరలిస్తున్నారంటూ గుడ్లూరు(M) చేవూరు, కావలి(M) చెన్నాయపాలెం ప్రజలు హైకోర్టులో పిల్ వేశారు. దానిపై విచారించిన ధర్మాసనం సమగ్ర నివేదిక ఇవ్వాలని నెల్లూరు(D) కలెక్టర్‌ను ఆదేశించింది.

News October 31, 2025

వెంకటగిరి: బాలికపై లైంగిక దాడి.. మారుతండ్రికి జీవిత ఖైదు

image

బాలికపై మారు తండ్రి పలుమార్లు లైంగిక దాడి కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు సర్వేపల్లి అంజయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వెంకటగిరి బంగారు పేట అరుంధతి పాలేనికి చెందిన సర్వేపల్లి అంజయ్యకు ఓ వివాహితతో పరిచయం ఏర్పండి. ఈ క్రమంలో ఆమెతో ఉంటూ మహిళ 15 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 2021 జులై 19న కేసు నమోదైంది.

News October 31, 2025

నెల్లూరు మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డిప్లొమా కోర్సులో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. లోకల్ 85%, నాన్ లోకల్ అభ్యర్థులకు 15% సీట్లు కేటాయిస్తామని కాలేజీ ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు. అభ్యర్థులు రూ.100 చెల్లించి అప్లికేషన్లు తీసుకోవాలని.. నవంబర్ 7వ తేదీ లోపు కాలేజీలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు spsnellore.ap.gov.in/notice/ వెబ్‌సైట్ చూడాలన్నారు.