News April 7, 2024

సౌదీ అరేబియాలో నెల్లూరు వాసుల మృతి

image

సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుత్తలూరు, గుంటూరుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయ. నర్రవాడకు చెందిన సత్యబాబు సౌదీలోని ఓ పారిశ్రామిక సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అతని మామ గుంటూరుకు చెందిన రామారావు దంపతులు వారి వద్దకు విజిటింగ్ వీసాపై వెళ్లారు. విమానాశ్రయం నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

Similar News

News January 16, 2025

నెల్లూరు: రూ.21 కోట్ల మద్యం తాగేశారు

image

సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో మద్యం ఏరులై పారింది. కేవలం ఐదు రోజుల్లో రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. ముఖ్యంగా భోగి, కనుమ పండగ రోజుల్లో మద్యం దుకాణాల వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులుతీరి కనిపించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం స్టాక్ అయిపోయినా ఏది ఉంటే అదే కొనుగోలు చేశారు.

News January 16, 2025

ఉదయగిరిలో జోరుగా కోడిపందేలు

image

సంక్రాంతి పండగ సందర్భంగా ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. పోలీసు అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతర్ చేస్తూ కోడిపందేలు నిర్వహించారు. మండలంలోని జి. చెరువుపల్లి, జి చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, కృష్ణంపల్లి పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కోడిపందేలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

News January 16, 2025

పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాల: జేసీ

image

పక్షుల పండుగకు వచ్చే పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆదేశించారు. బుధవారం ఆయన నేలపట్టు పక్షుల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ శాఖకు సంబంధించిన అధికారులు ఆ శాఖకు సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని చెరువు కట్టపై వన్ వే కోసం భారీ కేట్స్, వాహనాల రాకపోకలకు రహదారులపై పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.