News July 31, 2024
సౌదీ నుంచి విజయవాడ చేరుకున్న మెహరున్నీసా

సౌదీలో పని నిమిత్తం వెళ్లిన మెహరున్నీసా అక్కడ అష్టకష్టాలు పడటంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి మంగళవారం రాత్రి ఆమెను విజయవాడకు తీసుకువచ్చారు. మెహరున్నీసా కష్టాలు తెలుసుకొని ఆమె కుటుంబ సభ్యులను తీసుకొని తెలుగు మహిళ విజయవాడ నగర నాయకురాలు సొంటి ఈశ్వరి మంత్రి నారా లోకేశ్, విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా వద్దకు వెళ్లారు. వారు చొరవ తీసుకొని మెహరున్నీసాను క్షేమంగా విజయవాడ తీసుకువచ్చారు.
Similar News
News December 23, 2025
హైదరాబాద్లో కృష్ణా జిల్లా వ్యక్తి గంజాయి దందా

HYD గచ్చిబౌలిలోని ఓ పీజీ హాస్టల్ వేదికగా సాగుతున్న మాదకద్రవ్యాల గుట్టును రాయదుర్గం పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందం రట్టు చేసింది. కృష్ణా (D) పెదపారుపూడికి చెందిన కంభు వంశీ, చీరాల వాసి బాలప్రకాశ్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ముందుగా విజయవాడకు, అక్కడి నుంచి HYDకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు.
News December 23, 2025
కృష్ణా: UPHS, PHCలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు DMHO యుగంధర్ తెలిపారు. UPHSలలో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్ట్ ఒకటి, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు10, PHCలలో ల్యాబ్ టెక్నిషియన్ 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్టులు 10 ఖాళీలకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 23, 2025
దశాబ్దాల భూ సమస్యకు మోక్షం.. కలెక్టర్కు సన్మానం

దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 22-A భూ సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు కలెక్టర్ బాలాజీను మచిలీపట్నానికి చెందిన ఓ న్యాయవాది సన్మానించారు. సోమవారం కలెక్టరేట్లోని ‘మీ-కోసం’ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ చొరవతో వందలాది కుటుంబాలకు మేలు జరిగిందని, ప్రజల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు అభినందనీయమని న్యాయవాది కొనియాడారు. ఈ పరిష్కారంతో భూ యజమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


