News July 13, 2024

‘స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోండి’

image

2024 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్య కోసం క్రైస్తవ మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించనుంది. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా ఈనెల 8 నుండి ఆగస్టు 7లోపు అప్లై చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి కే సంజీవరావు ప్రకటించారు. అప్లై చేసిన కాపీలను రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆగస్టు 27 లోపు జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Similar News

News February 27, 2026

ఏరుగట్లలో గుప్తనిధుల కలకలం..!

image

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 27, 2026

పోలీస్ భవనాల ప్రారంభానికి డీజీపీ.. ఖమ్మంలో హై అలర్ట్

image

రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నూతన పోలీస్‌ భవనాల ప్రారంభోత్సవం నిమిత్తం ఆయన వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News February 26, 2026

వెలుగుమట్ల భూదాన్ భూములపై కలెక్టర్ వివరణ

image

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమిని రక్షించామని, అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.