News April 16, 2025

స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక ఉంచాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్ 

image

జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యత ఉండేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌ గౌతమీ సమావేశపు హాల్‌లో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం ఇన్‌ఛార్జి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు అందించాలన్నారు.

Similar News

News October 24, 2025

మ్యాచ్ రద్దు.. WCలో పాక్‌కు ఘోర అవమానం

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాక్ బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే భారీ వర్షం పడగా అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేశారు. అంతకుముందే ఇరు జట్లు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తం 7 మ్యాచ్‌ల్లో పాక్ ఒక్కటీ గెలవలేదు. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోగా 3 రద్దయ్యాయి. దీంతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.

News October 24, 2025

నర్సాపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

నర్సాపురంలోని 29వ వార్డులోని స్థానిక కళాశాల సమీపంలో నిడదవోలు నుంచి మొగల్తూరు వెళ్లే పంట కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న నరసాపురం ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతదేహానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే నరసాపురం పట్టణ పోలీసులను సంప్రదించాలన్నారు.

News October 24, 2025

చిన్న కాంట్రాక్టర్లకు తీపి కబురు

image

TG: ఆర్‌అండ్‌బీ చిన్న కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు అందించారు. సీఎం రేవంత్‌తో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్‌కు కృషి చేసినట్లు వివరించారు. మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేసిన సీఎం, మంత్రికి రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.