News August 18, 2024

‘స్టాప్ లాగ్’ సక్సెస్.. కార్మికులకు నగదు బహుమతి

image

తుంగభద్ర డ్యాంపై చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైన విషయం తెలిసిందే. 19వ గేట్ వద్ద స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న 20 మంది కార్మికులకు కర్ణాటక మంత్రి జమీర్ ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున బహుమతిగా ఇచ్చారు. ఎమ్మెల్యే గణేశ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి వారికి నగదు అందజేశారు. అలాగే ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టెక్నికల్‌ బృందానికి కొప్పల్‌ ఎంపీ రూ.2 లక్షలను బహుమతిగా అందజేశారు.

Similar News

News January 6, 2026

ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో శ్రామికుల హాజరు పెంచాలని, ఫారం పాండ్లు, కంపోస్ట్ పిట్‌లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గోకులం షెడ్లను జనవరి 15 నాటికి ప్రారంభించి, మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు.

News January 6, 2026

ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో శ్రామికుల హాజరు పెంచాలని, ఫారం పాండ్లు, కంపోస్ట్ పిట్‌లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గోకులం షెడ్లను జనవరి 15 నాటికి ప్రారంభించి, మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు.

News January 5, 2026

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వీడాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సీఎంఓ, ఎమ్మెల్యే, ఎంపీ పెండింగ్ ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు.