News January 26, 2025

స్టాళ్లను సందర్శించిన జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ధ‌ర్మ‌కంచ‌లో గల మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్, వైద్య, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన, చేనేత, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ, పేదరిక నిర్మూలన శాఖ, మెప్మా, తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీసీపీ, ఏఎస్పీ సందర్శించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకొని వారిని అభినందించారు.

Similar News

News December 7, 2025

గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

image

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.

News December 7, 2025

ADB: చెక్ పవర్ ఉంటే చాలు ఇంకేమీ వద్దు..!

image

పదవిపై ఆశ మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది. పంచాయతీల్లో సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించక సర్పంచ్ స్థానం రానివారు వార్డు మెంబర్‌గా పోటీ చేసే ఉపసర్పంచ్ అవుదామనుకుంటున్నారు. ఇప్పటికే నామినేషన్ల సమర్పణ పూర్తికాగా.. వార్డు మెంబర్లుగా బరిలో ఉన్న వారికి కానుకలిస్తూ తనను ఉప సర్పంచ్‌గా బలపరచాలని కోరుతున్నారు. చెక్ పవర్ కోసం పాకులాడుతున్నారు.

News December 7, 2025

ఏడుకొండల వాడికి పుష్ప కైంకర్యం చేసిన భక్తుడు

image

శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసిన గొప్ప భక్తుడు అనంతాళ్వార్. ఈయన రామానుజాచార్యుల శిష్యుడు. గురువు ఆదేశం మేరకు తిరుమలలో స్వామివారి సేవకు పూల తోటను పెంచారు. ఓసారి స్వామివారు పిల్లవాడి రూపంలో వచ్చి ఆయనను పరీక్షించగా కోపంతో గునపం విసిరారు. అది తగిలి స్వామివారి చుబుకానికి గాయమైంది. అందుకే శ్రీవారి గడ్డంపై కర్పూరపు చుక్క పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంది. ఆ గునపాన్ని తిరుమలతో చూడవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>