News March 15, 2025
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంతో పవన్ పాత్ర కీలకం: కొణతాల

స్వార్థం అనేది లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ అని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ‘రాజకీయం లేకుండా సినిమాల్లో ఉండి ఉంటే ఎన్ని కోట్లు సంపాదించే వారో? కానీ ప్రజల కోసం పవన్ రాజకీయాల్లోకి కొనసాగారు. 11 ఏళ్లు నిర్విరామంగా పోరాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంతో పవన్ కీలక పాత్ర పోషించారు. నిస్వార్థమైన పవన్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాలి’ అని చిత్రాడలోని జనసేన ఆవిర్భావ సభలో అన్నారు.
Similar News
News October 23, 2025
GWL: భారీగా పెరిగిన జోగుళాంబ హుండీ ఆదాయం

అలంపూర్ మండలంలోని ఐదవ శక్తిపీఠం శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ లెక్కింపులో దేవస్థానానికి మొత్తం రూ.60,78,413 ఆదాయం సమకూరింది. ఇందులో జోగుళాంబ హుండీ ఆదాయం రూ.50,76,149, బాల బ్రహ్మ హుండీ ఆదాయం రూ.9,97,016గా ఉంది. ఈ కార్యక్రమంలో ఈవో దీప్తి, సిబ్బంది పాల్గొన్నారు.
News October 23, 2025
ఇండియా టెక్ డెస్టినేషన్గా ఏపీ: CM CBN

డేటా సెంటర్లు, AI మెషీన్ లెర్నింగ్, ఫిన్టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్సు వంటి రంగాల్లో పెట్టుబడులకు AP ఎంతో అనుకూలమని CM CBN తెలిపారు. ఇండియా టెక్ డెస్టినేషన్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. UAE టెక్ కంపెనీలతో కలిసి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అబుదబీలో నెట్వర్క్ లంచ్లో పాల్గొన్న ఆయన ఆ దేశ ఛాంబర్ ఛైర్మన్, ADNOC గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
News October 23, 2025
ప్రకాశంలో వర్షం ఎఫెక్ట్.. రూ.2 కోట్లు మంజూరు చేసిన సీఎం

ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే జోరుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రైతాంగం నష్టాన్ని చూడాల్సి వచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, ఇతర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేశారు.