News January 21, 2025

స్టీల్ ప్లాంట్: విద్యుత్ షాక్‌తో కార్మికుడి దుర్మరణం

image

స్టీల్ ప్లాంట్‌ రైల్వే లైన్‌లో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్టు కార్మికుడు సోమవారం మృతి చెందాడు. ఇస్లాం పేటకు చెందిన మహమ్మద్ గౌస్ (26) స్టీల్ ప్లాంట్‌లో రైల్వేకు చెందిన సురభి ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్నాడు. ట్యాంకర్‌పై ఉన్న విద్యుత్ లైన్లు తాకడం వల్ల షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 8, 2025

T -10 దివ్యాంగ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న గాజువాక కుర్రాడు

image

అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని గాజువాక కుంచుమాంబ కాలనీకి చెందిన బి.మణికంఠ నిరూపించారు. క్రీడల్లో విశేషంగా రాణిస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన దివ్యాంగ క్రికెట్ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందారు. తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ నెల 16, 17,18 తేదీల్లో వారణాసిలో జరిగే T-10 దివ్యాంగ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కి సెలెక్ట్ అయ్యారు. 

News February 8, 2025

విశాఖ: కాలేజీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

image

పద్మనాభం మండలం పొట్నూరు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయనగరం నుంచి సైకిల్ పై స్వగ్రామం పొట్నూరు వస్తున్న పరదేశి(48)ని కాలేజీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. విధులకు హాజరు కావడానికి సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 8, 2025

కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 10, 22 తేదీలలో రాత్రి 10.20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 13, 25 తేదీలలో సాయంత్రం 5:45కు గోరఖ్‌పూర్‌లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

error: Content is protected !!