News February 25, 2025

స్టీల్ ప్లాంట్ విషయంలో చేతులు జోడించి ప్రయత్నించాం: Dy.CM

image

ఏపీ ప్రజలకు ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఆంధ్రులు అనే భావన వస్తుందని Dy.CM పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు. 2021 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం చేసిన ప్రకటనకు YCP మద్ధతు పలికిందని అన్నారు. అప్పట్లో నాదేండ్లతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ నిర్ణయంపై పునరాలోచించాలని చేతులు జోడించి ప్రయత్నించామన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్లాట్లు వేసి అమ్ముకోడానికి YCP నాయకులు చూశారని ఆరోపించారు.

Similar News

News October 28, 2025

ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్‌లో భారీ అవకతవకలు: బీఆర్ నాయుడు

image

ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్‌లో ఉన్న కొందరు ఉద్యోగులు భారీ అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని TTD చైర్మన్ BR నాయుడు తెలిపారు. పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల అవినీతిపై ACB విచారణ చేయాలని తీర్మానం చేశామన్నారు. అనేక వస్తువులు కొనుగోళ్లలో గోల్ మాల్ సాగినట్లు తెలిసిందన్నారు. ఉదాహరణకు బయట రూ.400కొనే శాలువలు రూ.1300 కొన్నట్లు తెలిసిందన్నారు.

News October 28, 2025

రేపు, ఎల్లుండి పలు ఆర్జిత సేవలు రద్దు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్లుండి పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. దీనికి సంబంధించి రేపు రాత్రి 8-9 గంటల వరకు పుష్పయాగానికి అర్చకులు అంకురార్పణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఎల్లుండి తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఉండవని పేర్కొంది.

News October 28, 2025

తుఫాన్ చర్యలపై రాజమండ్రి MP ఆరా

image

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.