News May 22, 2024
స్టీల్ ప్లాంట్: 23న మిగిలిన వేతనాల చెల్లింపు

వేతనాల విషయమై స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ అఖిలపక్ష కార్మిక నేతలతో బుధవారం చర్చించారు. ఈ నెల 21న 50% జీతాలు చెల్లించడంతో మిగిలిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అడ్మిన్ భవనాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సీఎండీ వారిని చర్చలకు ఆహ్వానించారు. ఈ నెల 23న మిగిలిన 50% వేతనాలు చెల్లిస్తామని సీఎండీ హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.
Similar News
News September 15, 2025
విశాఖ: బస్సుల్లో రద్దీ.. ప్రయాణ సమయాలు మార్చుకోవాలని పిలుపు

స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా. 4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందన్నారు. దీంతో ఉ.10 నుంచి, సా.7 తర్వాత ప్రయాణాలు చేసేలా చూసుకోవాలని మహిళలు, ప్రయాణికులను కోరారు.
News September 15, 2025
మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.
News September 14, 2025
రుషికొండ బీచ్లో ఇద్దరు బాలురు గల్లంతు

రుషికొండ బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. పీఎం పాలెం, ఆర్హెచ్ కాలనీ ప్రాంతాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయితో పాటు మరో ఇద్దరు రుషికొండ బీచ్కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని మెరైన్ పోలీసులు, లైఫ్ గాడ్స్ కాపాడారు. సంజయ్, సాయి అచూకీ ఇంకా లభ్యం కాలేదని పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.