News March 2, 2025
స్టూవర్టుపురం ఉపాధ్యాయినిని ప్రశంసించిన చంద్రబాబు

బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన తొలి ఎరుకలి సామాజికవర్గ మహిళా ఉపాధ్యాయిని సాతుపాటి ప్రసన్నశ్రీ. ప్రస్తుతం ఈమె రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. ఈ విషయంపై CM చంద్రబాబు ‘X’ వేదికగా స్పందించారు. ప్రసన్నశ్రీ కథ ఆమె విశేషమైన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ఆమె ప్రయత్నాలకు తగిన గుర్తింపు రావడం సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
వారానికి 72 గంటల పనితోనే దేశాభివృద్ధి: మూర్తి

వారానికి 72గంటలు పనిచేయాలన్న గత వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించుకున్నారు. రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ అందుకోగలదు. కానీ దీనికోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలి. చైనాలో వారానికి 72 గంటల (9AM-9PM-6 రోజులు) రూల్ ఉంది. దేశ పని సంస్కృతిలో మార్పు అవసరమని చెప్పడానికి చైనా పని నియమమే ఉదాహరణ’ అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
News November 17, 2025
ఉమ్మడి విశాఖ జిల్లాలకు 28 బంగారు పతకాలు

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు 28 బంగారు, 8రజతం, 12 కాంస్యం పతకాలు లభించాయి. ఈనెల15 నుంచి 16 వరకు కాకినాడ, సూర్యకళామందీర్ కళ్యాణమండపంలో రాష్ట్రస్థాయి జూనియర్, క్యాడిట్, సీనియర్ క్యొరుగి, ఫూమ్ సే తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ ఛాంపియన్షిప్లో చోడవరం, అనకాపల్లి విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.
News November 17, 2025
మంచిర్యాల: మహిళలు జాగ్రత్త.!

బైక్పై ప్రయాణించేటప్పుడు మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. బైక్ వెనకాల కూర్చునేటప్పుడు లేదా స్కూటీలు డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వారు ధరించిన చున్నీలు, స్కార్ఫ్లు, చీరలు బైక్ వీల్స్లో పడకుండా సరి చూసుకోవాలి. పొరపాటున అవి చక్రంలో పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నిన్న రాత్రి గోదావరిఖనిలో వేమనపల్లికి చెందిన లత చీర కొంగు వీల్లో చిక్కుకొని చనిపోయిన విషయం తెలిసిందే.


