News March 2, 2025

స్టూవర్టుపురం ఉపాధ్యాయినిని ప్రశంసించిన చంద్రబాబు

image

బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన తొలి ఎరుకలి సామాజికవర్గ మహిళా ఉపాధ్యాయిని సాతుపాటి ప్రసన్నశ్రీ. ప్రస్తుతం ఈమె రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ విషయంపై CM చంద్రబాబు ‘X’ వేదికగా స్పందించారు. ప్రసన్నశ్రీ కథ ఆమె విశేషమైన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ఆమె ప్రయత్నాలకు తగిన గుర్తింపు రావడం సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలి: గరిమా అగ్రవాల్

image

విద్యార్థులు పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో వికసిత్, ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పాఠశాలల విద్యార్థుల జిల్లాస్థాయి ఇన్స్పైర్, విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, రాజ్య స్థరీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన(RS బీవీపీ) శుక్రవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఇంచార్జి కలెక్టర్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు.

News November 28, 2025

NRPT: దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 9 గంటలకు నారాయణపేట మినీ స్టేడియంలో దివ్యాంగుల కోసం ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ శుక్రవారం తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో క్యారమ్స్, చెస్, షాట్‌పుట్, రన్నింగ్ వంటి జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

News November 28, 2025

నిర్మల్ : రేపటి నుంచి దివ్యాంగుల క్రీడా పోటీలు

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నవంబర్ 29 (శనివారం) నుంచి దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రన్నింగ్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్ వంటి పోటీల్లో జూనియర్, సీనియర్ విభాగాల వారు పాల్గొనవచ్చన్నారు. విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన వివరించారు.