News March 21, 2025
స్టేషన్ ఘనపూర్లో మరోసారి బయటపడ్డ కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు

స్టే.ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం పొందడంతో సింగపురం ఇందిర వర్గానికి చెందన కాంగ్రెస్ రాష్ట్రమహిళా అధ్యక్షురాలు మౌనిక, మండల అధ్యక్షురాలు పద్మలు సీఎంతో పాటు పలువురి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ ఫ్లెక్సీపై స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఫొటో లేకపోవడంతో మండలంలో చర్చనీయాంశమైంది.
Similar News
News November 24, 2025
మూడు రోజులు గోదావరి జిల్లాలలోనే మంత్రి..!

మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం నుంచి 26వ తేదీ వరకు ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. సోమవారం ఉ.8. గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం చేరుకుంటారు. అక్కడ డిప్యూటీ సీఎంతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం తూ.గో జిల్లా దేవరపల్లి, రాజమండ్రిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
News November 24, 2025
ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 24, 2025
ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.


