News March 19, 2025
స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఒక ఇంట్లో జోడు పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్లో లుకలుకలు మొదలయ్యాయి. స్టే.ఘ మండల పార్టీ అధ్యక్షుడిగా జూలుకుంట్ల శిరీశ్ రెడ్డి ఉండగా.. అతని భార్య లావణ్యకు మార్కెట్ ఛైర్మన్ పదవిని, అంతేకాకుండా లింగాల ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడికి జనగామ మార్కెట్ వైస్ ఛైర్మన్ పదవి, జఫర్గడ్ మండల పార్టీ అధ్యక్షుడికి స్టే.ఘ. మార్కెట్ వైస్ ఛైర్మన్ పదవిని ఎమ్మెల్యే కట్టబెట్టారు.
Similar News
News November 7, 2025
VJA: మాజీ డీసీపీ విశాల్ గున్ని కేసు అప్డేట్ ఇదే.!

విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్ని సస్పెన్షన్ను ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకొని ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ఇటీవల క్యాట్ ఉత్తర్వులను ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని విచారణను వాయిదా వేయాలి’ అని ప్రభుత్వ న్యాయవాది కోరారు. విచారణను నవంబర్ 11కి వాయిదా వేసింది.
News November 7, 2025
రెబ్బెన: హత్య కేసు నిందితుడు పరార్!

హత్య కేసులో విచారణ కోసం తీసుకొచ్చిన ఓ నిందితుడు రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి పరారు కావడం కలకలం రేపింది. చేతికి వేసిన సంకెళ్లతో స్టేషన్ నుంచి పారిపోయినట్లు సమాచారం. 5 రోజుల క్రితం తిర్యాణి మండలం పిట్టగూడాకి చెందిన హన్మంత్ రావును అదే గ్రామానికి చెందిన సిడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. దీంతో వినోద్ను పోలీసులు తీసుకొచ్చి విచారించారు. కాగా 4 రోజులుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 7, 2025
ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.


