News February 4, 2025
స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 5, 2025
‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో విజయగాధలను ప్రసారం చేయండి: కలెక్టర్

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.
News December 5, 2025
డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ వినియోగించండి: పెద్దపల్లి కలెక్టర్

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బంది డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శిక్షణ అనంతరం అదేరోజు మ.2 నుంచి సా.6 గంటల వరకు తమ ఓటు నమోదైన మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఫారం-14, ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ తప్పనిసరిగా వెంట ఉంచాలన్నారు. సూచనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు.
News December 5, 2025
రాహుల్, ఖర్గేను కాదని శశిథరూర్కు ఆహ్వానం

రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో జరిగే ప్రత్యేక విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను కేంద్రం ఆహ్వానించింది. విదేశీ ప్రతినిధులు భారత్లో పర్యటించినప్పుడు అపోజిషన్ లీడర్లను పిలిచే సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుతిన్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఇస్తున్న ఈ విందుకు కాంగ్రెస్ నేత రాహుల్, AICC ప్రెసిడెంట్ ఖర్గేను ఆహ్వానించలేదు.


