News February 4, 2025
స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News November 8, 2025
కొలిమిగుండ్ల: వైరల్ ఫీవర్తో చిన్నారి మృతి

కొలిమిగుండ్లలోని అంకిరెడ్డిపల్లిలో వైరల్ ఫీవర్ సోకి విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి రాజు, రామాంజినమ్మ దంపతుల కుమార్తె పద్మిని(9) నాలుగో తరగతి చదువుతోంది. వారం రోజులుగా వైరల్ ఫీవర్, కామెర్లతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఎంఈఓ అబ్దుల్ కలాం సంతాపం వ్యక్తం చేశారు.
News November 8, 2025
ఈనెల 9 నుంచి KU దూరవిద్య పీజీ కాంట్రాక్టు తరగతులు

కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ కాంట్రాక్టు తరగతులు నవంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ప్రొ.బి.సురేశ్ తెలిపారు. నవంబరు 9, 11, 23, 30తో పాటు డిసెంబరు 7, 13, 14, 21, 28వ తేదీల్లో ఉ.10 గం.కు తరగతులు జరుగుతాయన్నారు. ఎంఏ, ఎంకామ్ కోర్సులు కేయూ కేంద్రం, మంచిర్యాల, ఖమ్మం, మణుగూరు తదితర అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 8, 2025
వరంగల్: ఈనెల 9న జాబ్ మేళా..!

జిల్లా ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 11న WGL ములుగు రోడ్లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎం.మల్లయ్య తెలిపారు. వివిధ ప్రైవేట్ కంపెనీల్లోని 30 ఖాళీల భర్తీ కోసం ఈ మేళా ఏర్పాటు చేశామన్నారు. 18-32 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. అభ్యర్థులు ఉ.10.30కు సర్టిఫికెట్లతో హాజరు కావాలి.


