News February 24, 2025

స్టేషన్ ఘనపూర్: యువత సరైన మార్గంలో ప్రయాణించాలి: ఎంపీ కావ్య

image

యువత సరైన మార్గంలో ప్రయాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఇప్పగూడెం గ్రామానికి చెందిన యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎంపీని కలిశారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

Similar News

News February 24, 2025

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారి దర్శనమిస్తుంది. దర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతరకు ముందు వచ్చే సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తుంది.

News February 24, 2025

సిరిసిల్ల: వ్యక్తిపై కేసు నమోదు: ఎస్పీ

image

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. వేములవాడ దేవాలయానికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన నూనె ముంతల రవీందర్ గౌడ్ (43) పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News February 24, 2025

శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాల సమర్పించనున్న మంత్రి ఆనం 

image

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరుఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రచారం జరిగినా చివరికి ఆనం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి 25వతేది(మంగళవారం)   స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించున్నారు. 

error: Content is protected !!