News April 6, 2025

స్టేషన్ ఘనపూర్: విద్యుత్ షాక్‌తో బీపీఎం మృతి

image

స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండలో బీపీఎంగా పని చేస్తున్న బోడావుల నాగదుర్గ బాలాజీ (26) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు సీఐ వేణు తెలిపారు. ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరు మండలం నర్సాయపాలెం గ్రామానికి చెందిన బాలాజీ 15 నెలల క్రితం మీదికొండలో పోస్టుమాస్టర్‌గా విధుల్లో చేరాడు. స్టేషన్ ఘనపూర్‌లో నివాసం ఉంటున్న ఆయన నీళ్ల కోసం మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు సీఐ చెప్పారు.

Similar News

News December 9, 2025

సంగారెడ్డి: మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలోని 7 మండలాల్లో జరిగే మెదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీసు బందోబస్తు మధ్య డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ తరలించాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు.

News December 9, 2025

సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం: CM

image

TG: నీతి ఆయోగ్, ISB, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజల సూచనలు, సలహాలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 83 పేజీలతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విజన్ డాక్యుమెంట్‌ను ఆయన ఆవిష్కరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.

News December 9, 2025

తిరుపతి నుంచి ఇంటర్ సిటీ నడపాలి: MLA

image

తిరుపతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రైళ్లు పెంచాల్సిన అవసరం ఉందని MLA ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి-సాయినగర్ శిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. గూడూరు-విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి నుంచి నడపాలని కోరారు. అలాగే హైదరాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగించాలని SCR GM శ్రీవాత్సవను కోరారు.