News March 12, 2025

స్టేషన్ ఘనపూర్:  సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

ఈనెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు రెండు రోజుల ముందే ఏర్పాటు పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్డీవో డీఎస్ వెంకన్నతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని, హెలిపాడ్ స్థలాన్ని, పార్కింగ్ స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News January 22, 2026

పాలమూరు కార్పొరేటర్‌కు ఫుల్ డిమాండ్

image

పాలమూరు కార్పొరేషన్​లో కార్పొరేటర్​ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి డివిజన్​ నుంచి ఒక్కోపార్టీ తరఫున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో 10 మందికిపై గానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్​గా మారింది. కాంగ్రెస్ 373 మంది, BJP నుంచి 250 మంది దరఖాస్తు చేసుకోగా, BRS నుంచి 446 మంది దరఖాస్తు చేసుకున్నారు.

News January 22, 2026

మూగజీవాలను చంపేవారిపై కఠిన చర్యలు: సీతక్క

image

TG: మూగజీవాలకు విషమిచ్చి చంపడం దారుణమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. పలు చోట్ల వీధికుక్కలకు విషమిచ్చి చంపిన ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. సమస్యకు పరిష్కారం చట్టబద్ధంగా, శాస్త్రీయంగా జరగాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. RRలోని యాచారంలో 100 కుక్కలకు విషమిచ్చిన ఘటన వెలుగు చూడగా, కామారెడ్డిలో కోతులను చంపిన ఘటనలో పలువురిపై కేసు నమోదైంది.

News January 22, 2026

వరంగల్: మిర్చి ‘ఘాటు’.. క్వింటా రూ. 29 వేలు!

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. గురువారం జరిగిన వేలంలో యూఎస్ 341 రకం మిర్చి క్వింటాకు ఏకంగా రూ. 29 వేల అత్యధిక ధర పలికింది. గత సోమవారం రూ. 20 వేలుగా ఉన్న ధర, నాలుగు రోజుల్లోనే రూ.9 వేలు పెరగడం విశేషం. ఉమ్మడి జిల్లాలో దిగుబడులు తగ్గడం, అంతర్జాతీయంగా ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.