News January 30, 2025

స్టేషన్ ఘన్పూర్‌లో న్యాయస్థానం ఏర్పాటు

image

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఫిబ్రవరి 1న న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్ట్ జడ్జి సూరేపల్లి నంద హాజరై ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల ప్రజలకు సత్వరమే న్యాయ సేవలు అందించేందుకు ఈ న్యాయస్థానం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.

Similar News

News October 17, 2025

భారత్‌తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

image

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్‌కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌‌ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్‌లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌‌లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

News October 17, 2025

HYD: IPS బ్యాచ్ పాసింగ్ పరేడ్‌కు BSF DG

image

HYDలోని SVP నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ RR IPS బ్యాచ్ శిక్షణ పూర్తైంది. మొత్తం 190 మంది IPSలు, అందులో 65మంది మహిళలు (36%) ఉన్నారు. 50% మంది ఇంజినీరింగ్ నేపథ్యంతో అభ్యర్థులు ఉన్నారు. పరేడ్‌కు BSF DG దల్జిత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభావంతులైన ట్రైనీలకు అవార్డులు అందజేయానున్నారు. 49 వారాల పాటు కఠిన శిక్షణ పూర్తిచేసిన అధికారులు త్వరలో బాధ్యతలు చేపడతారు.

News October 17, 2025

కేయూ రిజిస్ట్రార్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు

image

కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ రామచంద్రంకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేయూలో తాత్కాలిక
ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పోరిక రమేశ్ తనను యూనివర్సిటీలోని అధికారులు వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషన్ రిజిస్ట్రార్‌‌ను వివరణ కోరుతూ 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.