News January 30, 2025
స్టేషన్ ఘన్పూర్లో న్యాయస్థానం ఏర్పాటు

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఫిబ్రవరి 1న న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్ట్ జడ్జి సూరేపల్లి నంద హాజరై ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల ప్రజలకు సత్వరమే న్యాయ సేవలు అందించేందుకు ఈ న్యాయస్థానం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.
Similar News
News November 20, 2025
2031కి 100 కోట్ల 5G సబ్స్క్రిప్షన్లు

2031 చివరికి భారత్లో 5G సబ్స్క్రిప్షన్లు 100 కోట్లు దాటుతాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ అంచనా వేసింది. 2031 వరకు మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 79% 5జీకి మారుతాయని పేర్కొంది. 2025 చివరికి 394 మిలియన్లకు సబ్స్క్రిప్షన్లు చేరుకున్నాయని, ఇది మొత్తం సబ్స్క్రిప్షన్లలో 32 శాతమని తెలిపింది. దేశంలో పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం, నెట్వర్క్ విస్తరణ, 5G స్మార్ట్ఫోన్ కొనుగోళ్లే నిదర్శనమని చెప్పింది.
News November 20, 2025
PDPL: ‘ఓటర్ జాబితా ఫిర్యాదులు 22లోపు పరిష్కరించాలి’

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. 3 విడతల్లో ఎన్నికలు, మండలవారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఓటర్ జాబితా ఫిర్యాదులను నవంబర్ 22లోపు పరిష్కరించాలి అని సూచించారు. నవంబర్ 23న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురించాలన్నారు. ఎంసీసీ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
News November 20, 2025
HNK: సాదారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: కలెక్టర్

ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను పెంచాలని, సిజేరియన్లను తగ్గించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
12 వారాలలోపు ప్రతి గర్భిణీ వివరాలను ఏఎన్ఎం లు నమోదు చేయాలన్నారు. గర్భిణీలకు తప్పనిసరిగా నాలుగుసార్లు చెకప్ కు వచ్చేలా ఏఎన్ఎంలు, ఆశాలు కృషి చేయాలన్నారు.


