News May 23, 2024
స్ట్రాంగ్ రూములను అభ్యర్థులు, ఏజెంట్లు పరిశీలించవచ్చు: ఎన్నికల అధికారి

కంట్రోల్ రూంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు, వారి ఏజెంట్లు పరిశీలించవచ్చని ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అనుమతి లేదన్నారు.
Similar News
News July 8, 2025
10న చిత్తూరు జిల్లాలో PTM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.
News July 7, 2025
చిత్తూరు: అంటీముట్టనట్లుగానే వైసీపీ ఇన్ఛార్జ్లు?

ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన మాజీలు ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. YCP అధికారంలో ఉన్నన్ని రోజులు చుట్టపు MLAలుగా ఉన్న ఆ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారట. పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, కుప్పం ఇన్ఛార్జ్లు రాష్ట్రస్థాయిలో మినహా నియోజకవర్గ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.
News July 7, 2025
తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరు మృతి

తిరుపతి కపిలతీర్థం వద్ద సోమవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. భక్తులు, యాచకులపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ యాచకుడు మృతి చెందగా, మరో ఇద్దరు భక్తులు కోలుకుంటున్నారు. సైకో కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.