News February 28, 2025
స్ట్రాంగ్ రూమ్కు చేరిన బ్యాలెట్ బాక్సులు

పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముకు చేరుకున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్స్లను భారీ భద్రత మధ్య తీసుకుని వచ్చి జిల్లా కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూముకు చేర్చారు.
Similar News
News December 3, 2025
అమరావతిలో NGO టవర్స్.. 1,995 ఫ్లాట్లు రెడీ.!

అమరావతిలో నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (NGO) టవర్స్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఏపీసీఆర్డీఏ పర్యవేక్షణలో మొత్తం 21 భారీ టవర్లను నిర్మిస్తున్నారు. స్టిల్ట్+12 అంతస్తులతో కూడిన ఈ ప్రాజెక్టులో ఏకంగా 1,995 ఆధునిక ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఉద్యోగులకు సౌకర్యవంతమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గ నివాసాలు కల్పించడమే దీని లక్ష్యం.
News December 3, 2025
చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా?

చిన్న వయసులోనే పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని USకు చెందిన NIH (National Institutes of Health) తాజా అధ్యయనంలో వెల్లడైంది. 10,000 మందికి పైగా పిల్లలపై స్టడీ చేయగా.. 12 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఫోన్కు అలవాటు పడిన వారిలో డిప్రెషన్, నిద్రలేమి, ఒబేసిటీ, అలసట వంటి సమస్యలు పెరిగినట్లు గుర్తించింది. ఫోన్లో ఏం చేస్తారన్నది కాదని.. అది కలిగి ఉండటమే ప్రమాదకరమని హెచ్చరించింది.
News December 3, 2025
HYD: నేతలను వెంటాడుతున్న నిరుద్యోగం

ORR పరిధిలోని 20 పట్టణాలు, 7 నగరాలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇది రాజకీయంగా ఎదగాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లింది. గ్రామంలో సర్పంచ్, వార్డ్ మెంబర్గా రాణిద్దామనుకునేలోపే మున్సిపాలిటీ చేశారు. తీరా పట్టణాలను బల్దియాలో విలీనం చేస్తుండడంతో రాజకీయ అవకాశాలు 30%పైగా తగ్గుముఖం పట్టనున్నాయి. నిరుద్యోగం విద్యార్థులనే కాదు.. నాయకులను సైతం వెంటాడుతోంది. మహా నగరంలో రాజకీయంగా ఎదగడం ఎలా? అని ఆలోచనలో పడ్డారు.


