News November 26, 2024

స్పందన అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వండి: అనంత ఎస్పీ

image

స్పందన అర్జీలకు పోలీసు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజలను నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి 82 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత పోలీసు అధికారులకు పంపించారు.

Similar News

News February 7, 2026

పంచాయతీ ఎన్నికలు.. కమిషన్ సన్నద్ధం

image

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లాలోని 577 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను మార్చి 9వ తేదీ నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ నెలలో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో, గడువు ముగియగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.

News February 7, 2026

సేవాలాల్ జయంతికి ప్రత్యేక బస్సులు: జేసీ విష్ణుచరణ్

image

శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గుత్తి – గుంతకల్లు మధ్య సేవాగఢ్ వద్ద బస్సుల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కేటాయించాలని సూచించారు. జయంతి వేడుకలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News February 7, 2026

సేవాలాల్ జయంతికి ప్రత్యేక బస్సులు: జేసీ విష్ణుచరణ్

image

శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గుత్తి – గుంతకల్లు మధ్య సేవాగఢ్ వద్ద బస్సుల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కేటాయించాలని సూచించారు. జయంతి వేడుకలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.