News April 2, 2025

స్పాట్ వాల్యుయేషన్‌కు 683మంది: అల్లూరి DEO

image

అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో తలార్ సింగ్ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి పదో తరగతి పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని DEO బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. పాడేరులో స్పాట్ నిర్వహణపై అధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. 75 మంది చీఫ్ ఎక్సమినర్స్, 450మంది అసిస్టెంట్ ఎక్సమినర్స్, 150మంది స్పెషల్ అసిస్టెంట్స్‌తో పాటు మొత్తం 683 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు.

Similar News

News December 4, 2025

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: తిరుపతి కలెక్టర్

image

APSSDC ఆధ్వర్యంలో 6వ తేదీ గూడూరు పట్టణంలోని DRW డిగ్రీ కళాశాల జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 15 కంపెనీల ప్రతినిధులు వస్తారని, 700 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 4, 2025

VZM: జిల్లా వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్-టీచర్ మీట్

image

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, నైపుణ్యాలు, పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు పాఠశాలల్లో పాల్గొననున్నారని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్నారు.

News December 4, 2025

NRPT: లాన్ టెన్నిస్ కోర్టు ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

image

నారాయణపేట జిల్లాలోని ఎస్పీ పరేడ్ మైదానంలో ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన లాన్ టెన్నిస్ కోర్టును కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ప్రారంభించారు. పని ఒత్తిడిని దూరం చేసి, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడమే లక్ష్యమని ఎస్పీ వినీత్ అన్నారు.