News January 27, 2025
స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ అవార్డు

మడకశిర స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాయప్ప ఉత్తమ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినందుకు రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని ఆదివారం అందుకున్నారు.
Similar News
News October 29, 2025
రైతులు నష్టపోకూడదు.. జనగామ కలెక్టర్ ఆదేశం

జనగామ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తుఫాను ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులతో బుధవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News October 29, 2025
భారీ వర్షాలు.. కల్లాల మీద ధాన్యం ఉందా?

కోతకోసి కుప్ప మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రైతులు రక్షించుకోవాలి. నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డిని కలిపితే గింజను వారం రోజులపాటు మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పార పట్టి నిలువ చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది.
News October 29, 2025
వికారాబాద్ జిల్లాలో అక్రమ దందా..!

వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక పక్క దారి పడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం పొందిన అనుమతులను దుర్వినియోగం చేస్తూ, ఇసుకను అక్రమంగా తరలించి, బయట మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే నాయకులు ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు మాత్రం భారీగా వినిపిస్తున్నాయి. పోలీసులు వాహనాలు ఆపితే చాలు ఒక బడా నాయకుడితో ఫోన్ చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.


