News October 5, 2024
స్వగ్రామానికి చేరుకున్న నరేశ్రెడ్డి మృతదేహం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు నూకల నరేశ్ రెడ్డి మరణాన్ని అధికారికంగా ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో రాత్రి ఒంటి గంటకు ఆయన స్వగ్రామం పురుషోత్తమాయగూడెంకు మృతదేహం చేరుకుంది. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు.
Similar News
News December 21, 2025
WGL: భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News December 20, 2025
క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష

క్రిస్మస్ పండుగను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా, వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మూడు నియోజకవర్గాలకు (వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట) ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించినట్లు తెలిపారు.
News December 20, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

భద్రకాళి ఆలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. పుష్య మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.


