News February 15, 2025

స్వచ్ఛ్ ఆంధ్రలో శ్రీ సత్యసాయి జిల్లాకు 19వ స్థానం

image

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లక్ష్యసాధనలో శ్రీ సత్యసాయి జిల్లాకు 19వ స్థానం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేకంగా ఓ థీమ్ తీసుకొని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. చెత్త సేకరణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి వాటిలో 105 పాయింట్లతో జిల్లా 19వ స్థానంలో నిలిచింది.

Similar News

News November 14, 2025

కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే మృతి

image

బేతంచెర్ల మండలం ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయ కోనేరు వద్ద విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మద్దయ్య కొడుకు మనోహర్(45) అప్పుడప్పుడు ఆలయ కోనేరులో ఈతకొట్టి స్వామివారిని దర్శించుకుని వెళ్తుండేవారు. ఈక్రమంలో గురువారం కోనేరులో ఈత కొడుతుండగా ఆయాసం రావడంతో గట్టుకు వచ్చి కూర్చున్న మనోహర్ కూర్చున్నట్లుగానే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

News November 14, 2025

సిద్దిపేట: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు

image

మైనర్‌ను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట డబుల్ బెడ్రూంలో నివాసం ఉంటున్న సమీర్ (22) ఈ నెల 10న రాత్రి బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులతో తాను వారి అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించాడు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదైంది.

News November 14, 2025

Jubilee hills bypoll: రిజల్ట్ ఎక్కడున్నా తెలుసుకోవచ్చు!

image

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరికొద్దిసేపట్లో కౌంటింగ్ జరగనుంది. అయితే, రౌండ్ల వారీగా రిజల్ట్ అప్‌డేట్స్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ECI చర్యలు తీసుకుంది. స్టేడియంలో LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని అధికారులు చెప్పారు. Way2Newsలోనూ ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాల వివరాలు చూసుకోవచ్చు.
SHARE IT