News March 15, 2025
స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర అమలు చేయండి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులు, పురపాలక సంఘం అధికారులు గ్రామాలలో, వార్డుల్లో కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి మూడో శనివారం ముందు రోజు రాత్రి గ్రామాలలో అధికారులు బస చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు.
Similar News
News November 25, 2025
త్వరలో వడ్డీ లేని రుణాలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమంలో భాగంగా, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత విభాగాధిపతులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
News November 25, 2025
త్వరలో వడ్డీ లేని రుణాలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమంలో భాగంగా, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత విభాగాధిపతులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
News November 25, 2025
రిజైండర్లను త్వరగా సమర్పించాలి: ASF కలెక్టర్

దినపత్రికలలో వచ్చే ప్రతికూల వార్తా కథనాలపై సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. సోమవారం ASF కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సత్వర చర్యలపై DPRO నుంచి వచ్చే రిజైండర్లకు తీసుకున్న చర్యలపై సమాచారం అందించాలని ఆదేశించారు.


