News March 15, 2025

స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర అమలు చేయండి: కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులు, పురపాలక సంఘం అధికారులు గ్రామాలలో, వార్డుల్లో కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి మూడో శనివారం ముందు రోజు రాత్రి గ్రామాలలో అధికారులు బస చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు.

Similar News

News October 14, 2025

జగిత్యాల జిల్లాకు వర్ష సూచన

image

జగిత్యాల జిల్లాలో రానున్న 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా జిల్లాలో ఈరోజు ఉదయమే అక్కడక్కడ చిరుజల్లు కురిసాయి.

News October 14, 2025

ఈ నెల 17న కాకినాడలో జాబ్ మేళా

image

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న 656 ఉద్యోగాలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. గోపాల్ ఆటోమేటివ్‌, డెక్కన్ ఫైనాన్స్‌, అపోలో ఫార్మసీ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న, టెన్త్‌ నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.

News October 14, 2025

మోదీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంపై Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ‘$15 బిలియన్ల పెట్టుబడితో విశాఖలో అతిపెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. రాష్ట్రంతో పాటు దేశానికి ఇది ఎంతో ముఖ్యం. చాలామందికి ఉపాధి లభించనుంది. యంగ్ ప్రొఫెషనల్స్‌కు టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. PM మోదీ, CM CBN, కేంద్ర మంత్రులు సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, సుందర్ పిచాయ్‌కి నా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.