News August 9, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి సవిత

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొననున్నారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 15వ తేదీ జరిగే జాతీయ పతాక ఆవిష్కరణకు మంత్రి సవిత ముఖ్యఅతిథిగా హాజరవుతారని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Similar News

News November 18, 2025

వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

image

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్‌లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

News November 18, 2025

వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

image

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్‌లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

News November 18, 2025

అర్జీలు త్వరగా పరిష్కరిస్తాం: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు.