News April 12, 2025
స్వామి, అమ్మవార్లు పూలమాలలు మార్చుకోవడమే ఎదుర్కోలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కల్యాణవేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.
Similar News
News December 9, 2025
ప్రకాశం: ‘డిసెంబర్ 31 వరకు అవకాశం’

ఇంట్లో గృహోపకరణాలపై అడిషనల్ లోడ్పై చెల్లింపులో 50% రాయితీ ఇస్తున్నట్లు SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. 1కిలో వాట్కు రూ.2250 అవుతుందని రాయితీ వలన రూ.1250 చెల్లించవచ్చని అన్నారు. ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమేనని తెలిపారు. ఇంట్లో గృహోపకరణాలను బట్టి లోడ్ కట్టుకోవాలన్నారు. తనిఖీల్లో లోడ్ తక్కువగా ఉంటే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
News December 9, 2025
నేడు అమరావతిలో పర్యటించనున్న మంత్రి నారాయణ

అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 నిమిషాలకు CRDA కార్యాలయం వద్ద బయలుదేరి అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం రోడ్ల నిర్మాణ పరులను పరిశీలించి మీడియాతో మంత్రి మాట్లాడతారని వెల్లడించారు.
News December 9, 2025
వనపర్తి: ఊర్లో ఎన్నిక.. సిటీలో ప్రచారం

నగరంలో బతుకుదెరువు, పొట్ట కూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ రాష్ట్రంలోని ఆయా గ్రామాల నుంచి ఆయా వర్గాల ప్రజలు వచ్చి జీవిస్తుంటారు. ఈనెల14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి మండలం పెద్ద తండా(డి) గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాత్లావత్ రాజ్యా నాయక్ బోయినపల్లి, బాపూజీనగర్, హస్మత్పేట, సెంటర్ పాయింట్ ఏరియాలలో ఓటర్లను కలిసి అభ్యర్థించారు.


