News April 4, 2025

స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత హోదా ఇవ్వండి: ఎంపీ

image

రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పరిగణించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేసే అవకాశం వస్తుందన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాల అభివృద్ధి, నూతన పరిశోధన ప్రయోగశాలలు, వైద్య పరికరాలకు నిధులు వస్తాయన్నారు.

Similar News

News November 10, 2025

జీఎస్టీ సంస్కరణలు.. 50% పెరిగిన నెక్సాన్ సేల్స్

image

జీఎస్టీ సంస్కరణలు, పండుగ సీజన్‌తో అక్టోబర్‌లో ఆటోమొబైల్ సేల్స్ పెరిగాయి. SUV మార్కెట్‌లో పోటీదారుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజా సేల్స్‌ను టాటా నెక్సాన్ బీట్ చేసింది. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఈ మోడల్ సేల్స్ 50% పెరిగాయి. 2025 అక్టోబర్‌లో క్రెటా 18,381, నెక్సాన్ 22,083, బ్రెజా 12,072 యూనిట్లు సేల్ అయ్యాయి. నెక్సాన్ బేస్ మోడల్ రూ.7.32 లక్షల నుంచి మొదలవుతుంది.

News November 10, 2025

అందుకే నెక్లెస్ ధరించా: అల్లు శిరీష్

image

నిశ్చితార్థ వేడుకలో తాను నెక్లెస్ ధరించడంపై వస్తోన్న మీమ్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీశ్ స్పందించారు. ‘దీనికే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో’ అంటూ వచ్చిన మీమ్‌కు కౌంటరిచ్చారు. ‘మన తెలుగు మీమర్లు చాలా ఫన్నీ. మన మహారాజులు & మొగలులు చోకర్లు(నెక్లెస్) ధరించేవారు. చోకర్లు మహిళలకే అనేది పాతకాలం. ఇది 2025.. మనం అలాంటి పరిమిత నమ్మకాల నుంచి బయటకు రావాలి’ అని ట్వీట్ చేశారు.

News November 10, 2025

కొత్తపేటకు రానున్న కేంద్ర బృందం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేంద్ర ప్రభుత్వ పంట నష్టాల అంచనా బృందం మంగళవారం పర్యటించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అధికారులతో కేంద్ర బృందం పర్యటనపై ఆయన సోమవారం చర్చించారు. మొంథా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాల పూర్తి వివరాలను, ఛాయాచిత్రాలతో సహా కేంద్ర బృందానికి తెలియజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.