News July 30, 2024

స్వీడన్ బ్యాచ్ ప్రోగ్రాం కోర్సుకు 13 అడ్మిషన్లు

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వీడన్ బ్యాచ్ ప్రోగ్రాం కోర్సుకు 13మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. దీనికి సంబంధించి మొత్తం 4సంవత్సరాల బీటెక్ కోర్సుకు గాను.. 3 సంవత్సరాలు జేఎన్టీయూ క్యాంపస్‌లో చదివిన అనంతరం మిగిలిన 1 సంవత్సరం స్వీడన్‌లో చదువుతారు. ఈ మేరకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య విద్యార్థులకు తమ అడ్మిషన్ పత్రాలను అందజేశారు.

Similar News

News November 13, 2025

10 మంది ఉద్యోగులకు ఎంపీడీఓలుగా పదోన్నతి!

image

అనంతపురం జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న 10 మందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)గా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తన క్యాంపు కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు పంచాయతీరాజ్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

News November 13, 2025

భార్యను హతమార్చిన భర్త

image

అనంతపురం జిల్లా బెలుగుప్పలో గురువారం దారుణ ఘటన జరిగింది. భార్యను భర్త హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో నరికి చంపాడు. హత్య తర్వాత నిందితుడు బెలుగుప్ప పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 13, 2025

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

image

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.