News May 12, 2024

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు

image

ఈ నెల 13 న జరిగే లోక సభ పోలింగ్ కు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయుటకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటర్లు వంద శాతం పోలింగ్ లో పాల్గొనాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి వీలుగా 913 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 64 సమస్యాత్మక లొకేషన్లలో 183 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గట్టి భద్రతా ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 28, 2026

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.

News February 28, 2026

NZB: సౌందర రాజన్ మృతికి కవిత సంతాపం

image

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కవిత సంతాపం వ్యక్తం చేశారు. సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News February 27, 2026

NZB: సిర్పూర్ శివారులో అస్థిపంజరం లభ్యం

image

మోపాల్ మండలం సిర్పూర్ శివారులోని గుట్ట వద్ద ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ అస్థిపంజరం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా మృతదేహం నెల రోజుల క్రితం గల్లంతైన ఈర్ల సాయిలుగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.