News January 31, 2025
హంద్రీనీవా కాలువ పనుల పరిశీలించిన మంత్రి సవిత

రోద్దం మండలంలోని బొక్షం పల్లి సబ్ స్టేషన్ వద్ద హంద్రీనీవా కాలువ పనులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి కాలువ పనులను పరిశీలించిన మంత్రి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
HYDకు మెస్సీ.. వారంలో బుకింగ్స్

ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డిసెంబర్లో హైదరాబాద్కు రానున్నారు. కేరళ ప్రోగ్రామ్ రద్దవడంతో HYDను చేర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి/రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదిక ఉంటుందని, వారంలో బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. GOAT Cupలో భాగంగా డిసెంబర్ 12/13 తేదీల్లో మెస్సీ కోల్కతా చేరుకుంటారు. అదే రోజు HYD, 14న ముంబై, 15న ఢిల్లీలో సెలెబ్రిటీలతో ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడతారు.
News November 2, 2025
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కొండపల్లి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలై పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News November 2, 2025
KNR: పీఎఫ్, డిపాజిట్లపై అవగాహన ముఖ్యం: కమిషనర్

క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా, పీఎఫ్ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ కేవైసీ, ఫోన్ నంబర్, అడ్రస్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు.


