News July 25, 2024

హత్యాయత్నం కేసు విచారణ చేపట్టిన DSP

image

పీలేరు మండలం, కావలిపల్లె పంచాయతీ, ఒంటిల్లులో టీడీపీ నేత గిరి నాయుడుపై జరిగిన హత్యాప్రయత్నంపై డీఎస్పీ రామచంద్ర రావు విచారణ చేపట్టారు. హత్యాయత్నం ఘటన జరిగిన ఇంటిని డీఎస్పీ, పీలేరు సీఐ మోహన్ రెడ్డి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు మాస్కులు, గ్లౌజులు తొడిగి ఉన్నట్లు బాధితుడు పోలీసులకు చెప్పారు. నిందితులతో తాను ప్రతిఘటించానని, వారు తమ ద్విచక్ర వాహనాల్లో పరారీ అయ్యారన్నారు.

Similar News

News October 24, 2025

పౌల్ట్రీ రంగ రైతులతో కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని పౌల్ట్రీ రంగం రైతులు, కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి రైతులు, కంపెనీలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తామని వివరించారు. రైతులకు కంపెనీలు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రాయితీల సక్రమంగా అందించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News October 24, 2025

చిత్తూరు జిల్లాలో 177 ఎకరాలలో దెబ్బతిన్న వరి పంట

image

వర్షాల కారణంగా జిల్లాలో 177 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. 12 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో 172 మంది రైతులు సాగు చేసిన వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 70 ఎకరాల్లో పైరు దెబ్బతినగా, చౌడేపల్లె మండలంలోని ఒకే గ్రామంలో 40 ఎకరాలు, యాదమరి మండలంలోని ఐదు గ్రామాల్లో 12.25 ఎకరాలు సాగు చేసిన వరి పైరు దెబ్బతింది.

News October 24, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో బంగారుపాళ్యం మినహా 31 మండలాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిండ్రలో 83.4 మిమీ, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది. మండలాల వారీగా కుప్పంలో 35.2, విజయపురంలో 34.4, నగరిలో 28.8, శ్రీరంగరాజపురంలో 26.8, పాలసముద్రంలో 26.6, గుడుపల్లెలో 23.6, సోమలలో 14.6 మీ. మీ వర్షపాతం నమోదు అయింది.