News July 25, 2024

హత్యాయత్నం కేసు విచారణ చేపట్టిన DSP

image

పీలేరు మండలం, కావలిపల్లె పంచాయతీ, ఒంటిల్లులో టీడీపీ నేత గిరి నాయుడుపై జరిగిన హత్యాప్రయత్నంపై డీఎస్పీ రామచంద్ర రావు విచారణ చేపట్టారు. హత్యాయత్నం ఘటన జరిగిన ఇంటిని డీఎస్పీ, పీలేరు సీఐ మోహన్ రెడ్డి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు మాస్కులు, గ్లౌజులు తొడిగి ఉన్నట్లు బాధితుడు పోలీసులకు చెప్పారు. నిందితులతో తాను ప్రతిఘటించానని, వారు తమ ద్విచక్ర వాహనాల్లో పరారీ అయ్యారన్నారు.

Similar News

News October 1, 2024

తెలంగాణ DSCలో పలమనేరు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్

image

తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ-24 ఫలితాలలో పలమనేరుకు చెందిన తహసీనా ప్రతిభ చూపింది. తహసీనా 75.57 శాతం మార్కులతో ఉర్దూ మీడియంలో తొలి ర్యాంకు సాధించింది. విద్యార్థిని తండ్రి సుందర్ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డీఎస్పీ టాపర్‌గా నిలిచిన విద్యార్థినిని పలువురు అభినందించారు.

News October 1, 2024

చిత్తూరు: ‘నవంబర్ 15 లోపు అందజేయాలి’

image

ST గ్రామాలలో బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేనివారికి నవంబర్ 15లోపు అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం వాటి మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 588 హాబిటేషన్లో సుమారు 60 వేల మంది ఉన్నారని.. వారికి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నట్టు కలెక్టర్ చెప్పారు. వాటిపై చర్యలు చేపట్టాలన్నారు.

News September 30, 2024

తిరుపతి : రేపు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు

image

శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ నందు కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్, అనస్తీషియా టెక్నీషియన్, జూనియర్/ సీనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ మొత్తం 6 రకాల పోస్టులు 8 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు http://slsmpc.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.