News April 14, 2025
హత్య కేసులో నిందితులు పోలవరం వాసులు

కొవ్వూరు (M) దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసులో నిందితుడు పోలవరం (M) పాత పట్టిసీమకు చెందిన శ్రీనివాస్గా పోలీసులు వెల్లడించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్రావు వద్ద శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ డబ్బులు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ పోలవరానికి చెందిన ప్రవీణ్తో కలిసి హత్య చేశారు. కుడి చేతికున్న బంగారం కోసం చేతి మణికట్టును కూడా నరికేశారు.
Similar News
News February 25, 2026
జగిత్యాల: 253 మంది విద్యార్థుల గైర్హాజరు

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సుల్లో 6,879 మంది, ఒకేషనల్లో 1,029 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పలు కేంద్రాలు సందర్శించారు. ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.
News February 25, 2026
విధులకు డుమ్మా… 94 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్ల తొలగింపు

TG: ఓ పక్క ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు…మరోపక్క విధులకు డుమ్మాకొడుతూ ప్రైవేటు ప్రాక్టీసు. బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, Asst ప్రొఫెసర్ల బాగోతమిది. ఒకరో ఇద్దరో కాదు రాష్ట్రవ్యాప్తంగా 94మంది కొన్నేళ్లుగా విధులకు రావడం లేదు. వీరికి నోటీసులు జారీచేసిన ప్రభుత్వం తాజాగా అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గైర్హాజరీ తేదీ నుంచే ఈ టెర్మినేషన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
News February 25, 2026
WNP: క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశాలు

క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సుధీర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31న వనపర్తిలోని బాలకృష్ణయ్య క్రీడా మైదానంలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు హాజరుకావాలన్నారు. మండల స్థాయి ఎంపికలకు వెళ్లే బాల బాలికలు మొదటగా tgss.telangana.gov.in వెబ్సైట్లో
రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని పేర్కొన్నారు.


