News April 14, 2025

హత్య కేసులో నిందితులు పోలవరం వాసులు

image

కొవ్వూరు (M) దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసులో నిందితుడు పోలవరం (M) పాత పట్టిసీమకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు వెల్లడించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్‌రావు వద్ద శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ డబ్బులు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ పోలవరానికి చెందిన ప్రవీణ్‌తో కలిసి హత్య చేశారు. కుడి చేతికున్న బంగారం కోసం చేతి మణికట్టును కూడా నరికేశారు.

Similar News

News November 23, 2025

సూర్యాపేట: గుడిపాటి నరసయ్య రాజకీయ నేపథ్యం

image

సూర్యాపేట DCC అధ్యక్షుడిగా గుడిపాటి నరసయ్య నియమితులయ్యారు. తుంగతుర్తి(M) వెలుగుపల్లికి చెందిన ఈయన 1990-95 వరకు PPIML చండ్ర పుల్లా రెడ్డి నక్సల్ గ్రూప్‌లో పనిచేశారు. 2001-6 వరకు ZPTCగా, 2006-08 వరకు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో MLAగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టికెట్ ఆశించినా దక్కలేదు.

News November 23, 2025

నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

image

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

News November 23, 2025

భద్రాద్రి జిల్లాలో శనివారం ముఖ్యాంశాలు

image

✓భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న
✓దమ్మపేట: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలు సీజ్
✓కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
✓కొత్తగూడెం: ఎన్కౌంటర్ బూటకమే: CPIML మధు
✓అనుమానిత వాహనాలు తనిఖీ చేసిన ఇల్లందు పోలీసులు
✓భద్రాచలం: ఇసుక లారీలతో ప్రజల ఇబ్బందులు
✓కొత్తగూడెం: 4 లేబర్ కోడ్ రద్దు చేయాలి: TUCI
✓సింగరేణిలో 1258 మంది ఉద్యోగులు పర్మినెంట్