News July 11, 2024
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి

భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఇల్లూరుకు చెందిన ఎర్రిస్వామి, సువర్ణ(26) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో భార్య గొడవపడేది. నిన్న ఇద్దరూ గొడవపడగా భర్త భార్యను కొట్టడంతో ఆమె మృతిచెందింది. ఆ తర్వాత ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 18, 2025
వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
News November 18, 2025
వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
News November 18, 2025
అర్జీలు త్వరగా పరిష్కరిస్తాం: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు.


