News January 26, 2025

‘హథిరాంజీ మఠం కూల్చివేతను అడ్డుకుంటాం’

image

ప్రాణాలను అడ్డుగా పెట్టి తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠాన్ని కాపాడుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతిలోని మఠాన్ని శనివారం సాయంత్రం టీడీపీ నాయకులు పరిశీలించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. మఠం భవనాల కూల్చివేతతో రూ.కోట్ల నష్టం వస్తుందని చెప్పారు.

Similar News

News December 24, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే, 27, 28 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా వరుసగా 4 రోజులు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 29 సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.

News December 24, 2025

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 26,210 వద్ద.. సెన్సెక్స్ 89 పాయింట్లు పెరిగి 85,611 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్‌ఫైనాన్స్, NTPC, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్‌బ్యాంక్ షేర్లు లాభాల్లో.. టెక్‌మహీంద్రా, ఇన్ఫీ, TMPV, సన్‌ఫార్మా, HCL టెక్ నష్టాల్లో ఉన్నాయి.

News December 24, 2025

విత్తనాలు కొనేటప్పుడు రశీదు కీలకం

image

విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు మరియు డీలర్ సంతకం తప్పకుండా ఉండాలి. పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే ఆ రశీదును పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత రాకపోతే నష్టపరిహారానికి రశీదు అవసరం.