News March 1, 2025

హనుమకొండ: అబార్షన్ కోసం అలా చేయొద్దు: DMHO

image

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా కార్యాలయంలో శుక్రవారం DMHO అప్పయ్య, అధ్యక్షతన గర్భస్త పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వైసరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు పరీక్షల నిమిత్తం, లింగ నిర్ధారణ కోసం, అబార్షన్ కోసం అర్హత లేని వైద్యులను సంప్రదిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమన్నారు. చట్టం ప్రకారం అబార్షన్‌కి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో అవకాశం కల్పించిందన్నారు.

Similar News

News March 25, 2025

రంగారెడ్డి: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో 2,158 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్‌కు 13 పరీక్ష కేంద్రాల పరిధిలో 2,965 మంది హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

News March 25, 2025

జీడీపీలో ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబాటు

image

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరుల ఉత్పత్తులు వినియోగంలో ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల క్యాపిటల్ ఇన్కమ్, జీడీపీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు అంశాల్లోనూ ఉమ్మడి జిల్లాగా ఉన్న పాలమూరు పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉండగా, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితి అధ్వానంగా ఉంది.

News March 25, 2025

దిలావర్పూర్‌ ఆందోళనకారులపై కేసులు ఎత్తి వేసేనా…?

image

గతేడాది దిలావర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 130రోజుల నిరసనల తర్వాత ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఆందోళనకారులపై పెట్టిన కేసులను అధికారంలోకొస్తే తొలగిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తమపై కేసులు తొలగించాలని మహిళలు ఎదురుచూస్తున్నారని నిర్మల్ MLA మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

error: Content is protected !!