News February 10, 2025
హనుమకొండ: ఐనవోలులో లేగలపై హైనాల దాడి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధి గరిమెళ్లపల్లి గ్రామంలో రాత్రి హైనాలు దాడి చేసి మూగజీవాలను చంపాయి. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోకి హైనాలు చొరబడి పాకలో ఉన్న లేగలను చంపాయి. శనివారం చర్ల అజయ్ కుమార్ లేగను, ఆదివారం రాత్రి రాజారపు పోశాలు పాకలో ఉన్న లేగలపై దాడి చేసి చంపాయిని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
విశాఖ: వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ను గురువారం వేశారు. జీవీఎంసీ పరిధిలో 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బందికి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి వ్యాక్సిన్ వేశారు. వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు,శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
News November 27, 2025
ఖమ్మం: సర్పంచ్ అభ్యర్థి.. కోటి రూపాయల మ్యానిఫెస్టో

నేలకొండపల్లి(M) ముఠాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు గ్రామాభివృద్ధిపై భారీ మ్యానిఫెస్టోను ప్రకటించి సంచలనం సృష్టించారు. తాను సర్పంచ్గా ఎన్నికైతే, కోటి రూపాయల వరకు సొంత ఖర్చుతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాభివృద్ధి అవసరాల కోసం ఎకరం భూమిని విరాళంగా ఇస్తానని ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రకటనతో గ్రామంలో ఎన్నికలు హీటెక్కాయి.
News November 27, 2025
ఏపీఎం, ఇన్ఛార్జ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వండి: హనుమకొండ కలెక్టర్

శాయంపేట మండలం పత్తిపాక కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయకూడదని అధికారులను ఆదేశించారు. రైతుల వివరాలను ట్యాబ్లో వెంటనే నమోదు చేయకపోవడంపై ఏపీఎం, కేంద్రం ఇన్ఛార్జ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు టెంట్, తాగునీరు సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.


