News February 11, 2025
హనుమకొండ: చికెన్ సెంటర్ యజమానికి రూ.30 వేల పెనాల్టీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739286521645_51243309-normal-WIFI.webp)
అపరిశుభ్ర ప్రదేశంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న యజమానికి రూ.30 వేలు పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్యఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి తెలిపారు. న్యూశాయంపేటలోని వినాయక చికెన్ సప్లయర్స్ యాజమాన్యం సరియైన హైజీన్ పద్ధతులు పాటించడం లేదని ఆయన అన్నారు. దుకాణ ఆవరణ అపరిశుభ్రంతో పాటు చికెన్ వ్యర్థాలను డ్రైనేజీలో వదిలినందకు పెనాల్టీ విధించామన్నారు.
Similar News
News February 12, 2025
తిరుపతి: టెన్త్ అర్హతతో 99 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739280664907_673-normal-WIFI.webp)
టెన్త్ అర్హతతో తిరుపతి డివిజన్లో 59, గూడూరు డివిజన్లో 40 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
HYD: అమ్మాయిలు.. అలా చేస్తే ఊరుకోకండి: డీసీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319486200_15795120-normal-WIFI.webp)
కొద్దిపాటి పరిచయం ఉన్నవారితోనూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రహస్యంగా అమ్మాయిల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి, వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవ్వరికీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంపొద్దని HYD సైబర్ క్రైమ్ డీసీపీ కవిత సూచించారు. టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని, నగ్న విడియోలతో వేధింపులకు గురి చేస్తే మహిళలు మౌనంగా ఉండొద్దని 100, 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
News February 12, 2025
గుంటుపల్లిలో కుళ్లిపోయిన మృతదేహం కలకలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739290531641_51973468-normal-WIFI.webp)
గుంటుపల్లి శివారులో మంగళవారం కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గుంటుపల్లి శివారు కృష్ణానది ఒడ్డున ఓ షెడ్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సుమారుగా 30 రోజుల క్రితం వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.