News March 11, 2025

హనుమకొండ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

హనుమకొండ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

Similar News

News January 3, 2026

మాగాణి మినుములో కాండపు ఈగ – నివారణ

image

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News January 3, 2026

రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్‌’: మంత్రి

image

TG: ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్‌’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. ఈ క్లినిక్‌ల నిర్వహణలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ‘హబ్’గా వ్యవహరిస్తుందన్నారు. ‘గత 2ఏళ్లలో 6,12,973 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయించాం. 33.65L మంది పాఠశాల విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించి, 76,176 మందికి అద్దాలు పంపిణీ చేశాం’ అని వివరించారు.

News January 3, 2026

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: సంగారెడ్డి ఎస్పీ

image

జిల్లాలో ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరితోష్ పంకజ్ హెచ్చరించారు. చైనా మాంజాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని చెప్పారు. దీనివల్ల ద్విచక్ర వాహనాదారులు, పాదాచారులు, పక్షులు గాయపడుతున్నారని చెప్పారు తెలిపారు. పతంగుల దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.