News March 8, 2025

హనుమకొండ జిల్లాలో MURDER.. కారణం ఇదే..!

image

హనుమకొండ(D),ఎల్కతుర్తి(M), వీరనారాయణ గ్రామంలో తల్లి రేవతిని <<15683962>>కొడుకు చంపిన<<>> విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కుమారస్వామి,రేవతి(40) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు అజయ్(23) 2ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి 15ఏళ్ల క్రితం చనిపోగా తల్లి పెద్దకొడుకు వద్ద ఉంది. రాత్రి తాగొచ్చిన అజయ్ తల్లిని గొడ్డలితో నరికి చంపాడు.

Similar News

News March 15, 2025

NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

image

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.

News March 15, 2025

సిరిసిల్ల: కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

image

అక్రమ బెట్టింగ్ యాప్స్‌లలో బెట్టింగ్‌కి పాల్పడిన, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల ఎస్పీ మహేశ్‌ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమతో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని తెలిపారు.

News March 15, 2025

NGKL: శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలపై సర్వే.!

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో 7,668 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనుంది. రోజుకు ఈ రోడ్డుపై సగటున 7,181 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన్ననూరు చెక్‌పోస్ట్ వరకు 6,880, వట్వర్లపల్లి ఈగలపెంట మధ్య 7,005 వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుపై శ్రీశైలానికి, ఏపీకి ఎన్ని వాహనాలు వెళుతున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.

error: Content is protected !!