News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 26, 2025
నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్

2024-25 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. క్వార్టర్స్లో ఒకటి, సెమీస్లో 2 రన్స్ ఫస్ట్ ING లీడ్తో అనూహ్యంగా తొలిసారి ఫైనల్ చేరిన కేరళ, 2సార్లు టైటిల్ విన్నర్ విదర్భ జట్లు తుదిపోరులో తలపడనున్నాయి. అక్షయ్ వాడ్కర్(C), కరుణ్ నాయర్, మాలేవర్లతో విదర్భ బ్యాటింగ్ బలంగా ఉంది. అటు, సచిన్ బేబీ నేతృత్వంలోని కేరళ బ్యాటర్లు నిజార్, అజహరుద్దీన్, బౌలర్ జలజ్ సక్సేనాలపై ఆశలు పెట్టుకుంది.
News February 26, 2025
గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పదేళ్లు జైలుశిక్ష..!

యువతిని మోసగించి గర్భవతిని చేశాడనే అభియోగంపై నమోదు చేసిన కేసులో నిందితునికి పదేళ్లు జైలు శిక్ష రూ.5 వేలు జరిమానా విధించినట్లు అడ్డతీగల సీఐ నరసింహుమూర్తి తెలిపారు. పాత రామవరం గ్రామానికి చెందిన యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసగించాడు. విచారణలో నేరారోపణ రుజువు కావడంతో రాజమహేంద్రవరం ఎనిమిదవ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు వెల్లడించారని పేర్కొన్నారు.
News February 26, 2025
KMR:18,469 మంది విద్యార్థులు.. 38 సెంటర్లు..

ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న వేళ.. అధికారులు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు. KMR జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం 18,469 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం 38 పరీక్ష కేంద్రాలను, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, 6 గురు సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం తెలిపారు.