News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News December 13, 2025

MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.

News December 13, 2025

IHFMS టెండర్లలో భారీగా అవకతవకలు!

image

రాష్ట్రంలోని ప్రభుత్వ టీచింగ్, మెడికల్ కాలేజీల్లో శానిటేషన్, పేషెంట్ కేర్ సేవలను మెరుగుపరిచేందుకు తెచ్చిన నూతన పాలసీకి కాంట్రాక్టర్లు అడ్డంకిగా మారారు. 2024లో కాంట్రాక్టు అసోసియేషన్ కోర్టుకు వెళ్లగా, ప్రభుత్వం నేటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ప్రతీ కాంట్రాక్టర్ నెలకు లక్షల ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

News December 13, 2025

నిర్మల్: మంత్రాల నేపంతో హత్య చేసి.. కాల్చేశారు..!

image

మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసి కాల్చి బూడిద చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ CI అజయ్ ప్రకారం.. కడెం మం. గండిగోపాల్పూర్‌కు చెందిన దేశినేని భీమయ్య(55)ను అదే గ్రామానికి చెందిన నరేశ్, మల్లేశ్ ఈనెల 10న భీమయ్యాను కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేశారు.